లండన్: యూరోప్లో వలసదారుల వెతలు దారుణంగా ఉన్నాయి. ఫ్రాన్స్ నుంచి ఇంగ్లీష్ ఛానల్ ద్వారా బ్రిటన్కు వెళ్లాలనుకున్న వలసదారులు బోటు ప్రమాదంలో చనిపోయారు. సుమారు 27 మంది మరణించినట్లు రెండు దేశాలు ప్రకటించాయి. ఫ్రాన్స్లోని కలాయిస్ పోర్టు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు అత్యవసర సమావేశం నిర్వహించాయి. ఈ విషాద ఘటన నేపథ్యంలో అక్రమ వలసలను నియంత్రించేందుకు బోరిస్ జాన్సన్, మాక్రన్లు కీలక నిర్ణయం తీసుకోనున్ఆనరు. బాధితులను గుర్తిచేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బోటు మునిగిన ఘటనలో ప్రాణాలతో ఉన్నవారికి ప్రస్తుతం చికిత్సను అందిస్తున్నారు. ఫ్రాన్స్ అధికారులు నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.
ఉత్తర ఫ్రాన్స్లో చాలా వరకు వలసదారుల క్యాంపులు ఉన్నాయి. అయితే అక్కడివారంతా అక్రమరీతిలో బ్రిటన్కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ బోటులో వెళ్లినవారు దురదృష్టకరరీతిలో ప్రాణాలు కోల్పోయారు. డంకిర్క్ క్యాంపు వద్ద పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇటీవల అనేక క్యాంపులను ఫ్రాన్స్ దేశం ఎత్తివేసింది.