కీవ్: ఉక్రెయిన్లోని సుమీపై జరిగిన ఏరియల్ అటాక్లో 22 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. దాంట్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. రష్యా సామూహిక హననానికి పాల్పడినట్లు సుమీ గవర్నర్ డిమిట్రో జివిట్స్కీ తెలిపారు. ఒక్క రోజే ఆ నగరంపై మూడు బాంబు వేసినట్లు ఆయన తెలిపారు. అదో పీడకల లాంటి రాత్రి అన్నారు. ఒకే ఇంట్లో ఉన్న 9 మంది మృతిచెందినట్లు చెప్పారు. ఆరు ఇండ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు చెప్పారు. మరో 20 ఇండ్లు స్వల్పంగా ధ్వంసం అయ్యాయన్నారు. రష్యా కాల్పుల విరమణ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమీ నగరం నుంచి సుమారు అయిదు వేల మందిని తరలించారు.