ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఓ పెట్రోల్ ట్యాంకర్ను వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో బస్సులో ఉన్న 20 మంది సజీవదహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్యాసింజర్ బస్సు లాహోర్ నుంచి కరాచీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. బస్సుకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉందన్నారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.
సింధ్లో జరిగిన మరో ప్రమాదంలో ఎనిమిది మృతిచెందారు. మినీబస్సు అదుపుతప్పి బోల్తాపడంతో మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ రెండు ఘటనలపై పంజామ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఇలాహీ సంతాపం వ్యక్తంచేశారు.