బీజింగ్, జూన్ 28: ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రంగా పేరుపొందిన బైహేటన్ హైడ్రో పవర్ స్టేషన్లో 2 యూనిట్లను చైనా సోమవారం ప్రారంభించింది. కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల (జులై 1) సందర్భంగా వీటిని ప్రారంభిస్తున్నట్టు ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. చైనా నైరుతి ప్రాంతంలో యున్నాన్, సిచువాన్ ప్రావిన్సులో జిన్షా నదిపై ఉన్న బైహేటన్ హైడ్రో పవర్ స్టేషన్ను మొత్తం16 యూనిట్లతో నిర్మించతలపెట్టింది అక్కడి ప్రభుత్వం. ప్రతి యేటా 16 మిలియన్ కిలోవాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో వీటి నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టును 2022 వరకు పూర్తి చేస్తామని చైనా చెబుతున్నది.