Pakistan | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాంబు నిర్వీర్య బృందమే (bomb disposal team) లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు చనిపోగా (Pakistan soldiers dead).. నలుగురు గాయపడ్డారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ ( Balochistan province)లోని ఓడరేవు నగరం (port city) గ్వాదర్ (Gwadar) జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
గ్వాదర్ సమీపంలో అంకారా డ్యామ్ ప్రాంతంలో పాకిస్థాన్ ఆర్మీ బాంబు నిర్వీర్య బృందంపై గుర్తుతెలియని సాయుధ వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మొహ్సిన్ జోహైట్ తెలిపారు. ఓడరేవు నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు గాయపడినట్లు వెల్లడించారు. మృతదేహాలను, క్షతగాత్రులను వెంటనే గ్వాదర్ డెవలప్మెంట్ అథారిటీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది.. దుండగుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు ఇప్పటి వరకూ ఎవరూ బాధ్యత వహించలేదు.
Also Read..
Leopard | ఢిల్లీలో చిరుత కలకలం.. ఐదుగురిపై దాడి
Libya PM | లిబియా ప్రధాని నివాసంపై గ్రనేడ్ దాడి
Arvind Kejriwal | లిక్కర్ కేసులో తీహార్ జైలుకు కేజ్రీవాల్.. 15 రోజులు జ్యుడీషియల్ రిమాండ్