గాజా : గాజా స్ట్రిప్పై ఇజ్రాయిల్ రక్షణ దళాలు చేసిన దాడిలో 1203 మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్లు హమాస్(Hamas) గ్రూపు పేర్కొన్నది. ఆ దాడిలో సుమారు ఆరు వేల మంది గాయపడినట్లు హమాస్కు చెందిన ఆరోగ్యశాఖ తెలిపింది. మరో వైపు ఇజ్రాయిల్ రక్షణ దళాలు కూడా ప్రకటన చే|శాయి. ఇజ్రాయిల్ భూభాగంలో ఉన్న సుమారు 1500 మంది పాలస్తీనా ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది.
బందీలను విడిచిపెట్టేవరకు గాజాకు నీరు, విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఇజ్రాయిల్ ఇంధన శాఖ మంత్రి కట్జ్ తెలిపారు. బంధీ చేసిన వాళ్లను విడిచి పెట్టే వరకు గాజాకు ఎటువంటి నీరు, విద్యుత్తు సరఫరా ఉండబోదన్నారు. బందీలుగా తీసుకెళ్లిన 150 మంది పరిస్థితి ఎలా ఉందన్న విషయం ఇంకా తెలియదు.
సుదీర్ఘ పోరాటానికి హమాస్ ప్రిపేరైనట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు అంచనా వేస్తున్నాయి. హమాస్ ప్రయోగిస్తున్న రాకెట్ల వేగాన్ని బట్టి ఐడీఎఫ్ ఆ అంచనా వేసింది. రాకెట్ల ఫైరింగ్ లో వేగం తగ్గిందని, దీని వల్ల హమాస్ చాలా సుదీర్ఘ పోరాటానికి సిద్దమైనట్లు తెలుస్తోందని మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ రాఫి మిలో తెలిపారు. హమాస్ ప్రవర్తిస్తున్న తీరును గుర్తించినట్లు ఆయన చెప్పారు. సుదీర్ఘ యుద్ధానికి హమాస్ రెఢీ అయినట్లు ఆయన చెప్పారు.