మాస్కో: ఉక్రెయిన్ సమీపంలోని రష్యా సైనిక శిబిరంపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 11 మంది మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతమైన బెల్గోరోడ్లో రష్యా సైనిక శిబిరం నిర్వహిస్తున్నది. ఇందులో వాలంటీర్లకు శిక్షణ ఇస్తుండగా పూర్వ సోవియట్ స్టేట్కు చెందిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే తమ సైన్యం జరిపిన కాల్పుల్లో వారిద్దరు మరణించినట్లు తెలిపింది. ఈ ఘటనను ఉగ్రవాద దాడిగా పేర్కొన్నది.
ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో సెప్టెంబర్ 21 తర్వాత రష్యా తన సైన్యంలోకి రెండు లక్షల మందిని రష్యా తన సైన్యంలోకి వాలంటీర్లుగా తీసుకున్నది. వారందరికి ఆయా ప్రాంతాల్లో యుద్ధనైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నది. ఈ సందర్భంగా సైనిక శిబిరంపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు.