వాషింగ్టన్ : సుంకాల హెచ్చరికలతో తాను ఇంతవరకు ఆరు యుద్ధాలను ఆపినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం పునరుద్ఘాటించారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న భారత్-పాకిస్థాన్ల మధ్య యుద్ధాన్ని కూడా ఇదే కారణంతో నిలువరించినట్టు చెప్పారు.
‘యుద్ధాల ద్వారా ప్రజలు అన్యాయంగా చావాలని నేను అనుకోవడం లేదు. అందుకే మీపై సుంకాలు విధిస్తున్నాను’ అని హెచ్చరించిన తర్వాతే ఈ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయన్నారు. అప్పటికే వారి యుద్ధంలో 10 విమానాలు నేలకూలాయని, తాను యుద్ధాన్ని ఆపకుంటే అది అణుయుద్ధానికి దారి తీసి ఉండేదని ట్రంప్ అన్నారు.