కొలంబో, మార్చి 30: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రోజుకు 7 గంటల చొప్పున కొనసాగుతున్న విద్యుత్తు కోతలను 10 గంటలకు పెంచుతూ బుధవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది.
జలవిద్యుత్తును ఉత్పత్తి చేయడానికి తగినంత ఇంధనం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు అధికారులు తెలిపారు. కరెంట్ లేకపోవడంతో సాయంత్రం కాగానే వ్యాపారులు తమ దుకాణాలను మూసేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కొరతతో బస్సులను నిలిపేశారు. దీంతో ఇతర ప్రాంతాలు, నగర శివారుల్లోకి వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.