బీజింగ్: జీరో కొవిడ్ పాలసీతో చైనాలో లాక్డౌన్ అంటేనే ప్రజలందరూ వణికిపోతున్నారు. భారీగా కరోనా కొత్త కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కఠినమైన కొవిడ్ ఆంక్షల నుంచి తప్పించుకొనేందుకు జెంగ్ఝౌ నగరంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి కార్మికులు కంచెలు దూకి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీరంతా జెంగ్ఝౌలోని యాపిల్ ఐఫోన్ అసెంబ్లింగ్ ఫ్యాక్టరీ ఫాక్స్కాన్ సంస్థకు చెందిన కార్మికులని చైనాలోని బీబీసీ ప్రతినిధి పేర్కొన్నారు. ఫ్యాక్టరీ నుంచి బయటపడిన వర్కర్లందరూ వందల కిలోమీటర్లు నడుచుకొంటూ తమ స్వస్థలాలకు వెళ్తున్నారని ట్వీట్ చేశారు.