YS Sharmila | ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రిసెప్షన్ శనివారం జరగనుంది. హైదరాబాద్ శంషాబాద్లోని ఫోర్ట్ గ్రాండ్ హోటల్లో ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో ఫిబ్రవరి 17వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు జరిగింది. రాజస్థాన్లోని జోధ్ఫూర్ ప్యాలెస్లో కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వైభవంగా జరిగింది. ఫిబ్రవరి 18వ తేదీన క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో వీరి పెండ్లి జరిగింది.