హైదరాబాద్: నగరంలోని డబీర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. చంచల్గూడా జైలు సమీపంలోని రోడ్డుపై ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కొందరు యువకులు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఓ చిన్న వివాదంతో మొదలైన ఘర్షణ పెద్దదిగా మారింది. యువకులు ఒకరిపై మరొకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు.
అజీబ్, ముజీబ్, కమ్రాన్తో పాటు మరికొంత మంది చేసిన దాడిలో అద్నాన్, అతడి గ్యాంగ్ తీవ్రంగా గాయపడ్డారు. దెబ్బల ధాటికి అద్నాన్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. అద్నాన్ను ఉస్మానియా దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.