హైదరాబాద్: నగరంలోని హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సరోజినిదేవి దవాఖాన సమీపంలో వేగంగా దూసుకొచ్చిన బైకు.. టిప్పర్ లారీని ఢీకొట్టింది. దీంతో యువకుడు లారీకింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.