హైదరాబాద్: నగరంలోని మెహదీపట్నంలో యువకులు వీరంగం సృష్టించారు. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గంజాయి మత్తులో ఉన్న యువకులు ఆసిఫ్నగర్లో హల్చల్ చేశారు. పోలీసు వాహనం పైకి ఎక్కి ధ్వంసం చేశారు. మరికొన్ని వాహనాలపై దాడిచేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.