హైదరాబాద్ : పాతబస్తీలోని ఫలక్నూమా పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. గుల్జార్ నగర్కు చెందిన మహ్మద్ అబ్బాస్(23)ను కత్తితో పొడిచి చంపారు. మహ్మద్ అబ్బాస్ వృత్తిరీత్యా ఎలక్ట్రిషీయన్. అయితే శుక్రవారం రాత్రి ఓ ఇద్దరు వ్యక్తులు అబ్బాస్కు ఫోన్ చేసి బయటకు రావాలని పిలిచారు. దీంతో మహ్మద్ అబ్బాస్ తన ఇంటి నుంచి వారి పిలిచిన ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ అబ్బాస్తో ఆర్థిక లావాదేవీలపై చర్చించారు.
ఈ క్రమంలోనే ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా, అబ్బాస్ను కత్తితో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అబ్బాస్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఫలక్నూమా ఏసీపీ ఎంఏ మజీద్ పేర్కొన్నారు. ఈ కేసులో పర్వేజ్ అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.