కాచిగూడ,డిసెంబర్ 16 : విధులకు వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం నల్లకుంట డివిజన్లోని గోల్నాక వెజ్టేబుల్ మార్కెట్ ప్రాంతానికి చెందిన మల్లేశ్ కుమార్తె నందికంటి శ్రావణి(20)వృత్తిరిత్యా కాచిగూడ సీసీ షారప్ దవాఖానలో పనిచేస్తుంది.
ఈ నెల 15వ తేదీ ఉదయం విధులకు వెళ్లి వస్తానని కుటుంభ సభ్యులకు చెప్పిన శ్రావణి ఇప్పటికి తిరిగి రాకపోవడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి మల్లేశ్ గురువారం కాచిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇంట్లోంచి శ్రావణి వెళ్లే సమయంలో ఎరుపు రంగు టాప్, తెలుపు, నలుపు రంగు పైజామా ధరించి, ఎత్తు 5.2 ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.