హైదరాబాద్: నగరంలోని బాలానగర్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హుమాయున్ నగర్ పరిధిలో బాలానగర్లో షోయబ్ ఖాద్రి అనే వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. దుండగుల ఆచూకీ కోసం సమీపంలోని సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.