దుండిగల్, ఏప్రిల్ 18: ఆన్లైన్ గేమ్లకు బానిసలై విలువైన ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు మరొకటి వెలుగుచూసింది. ఆన్లైన్ గేమ్లో డబ్బులు పొగొట్టుకున్నాననే మనస్తాపంతో భార్య తిడుతుందనే భయంతో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన సోంపాల్ (32) ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చి దుండిగల్ తండా-2లో నివాసం ఉంటున్నాడు.
వృత్తిరీత్యా డ్రైవర్ అయిన సోంపాల్కు ఆన్లైన్ గేమ్లు ఆడే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఆన్లైన్ గేమ్లో సుమారు రూ.30 వేలు పొగొట్టుకున్నాడు. దీంతో ఈ విషయం తన భార్యకు తెలిస్తే తిడుతుందనే ఆందోళనకు లోనయ్యాడు. భయం, మనస్తాపం తోడు కాడంతో ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.