సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): హార్ట్ ఫుల్నెస్ ద్వారా మూడు రోజుల యోగ్ మహోత్సవ్ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. యోగాసనాలు, ప్రాణాయామం, ముద్రలు, ధ్యానంపై అవగాహన, ప్రయోజనాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
మంత్రి, శ్రీనివాస్గౌడ్, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 19న ఈ మహోత్సవం ముగియనున్నది. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రపంచ మార్గనిర్దేశకుడు కమలేశ్ పటేల్ దాజీ తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీస్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన యోగ్ మహోత్సవ్లో ఆసనాలు వేస్తున్న మంత్రి శ్రీనివాస్గౌడ్