రవీంద్రభారతి, ఫిబ్రవరి 16 : సమాజాన్ని చైతన్య పరిచే రచనలు చేయాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో లేఖిని రచయిత్రుల వేదిక సరసిజ థియేటర్స్ ఫర్ వి మెన్ సంయుక్తాధ్వర్యంలో ఔత్సాహిక రచయిత్రులకు కథా కార్యశాల పేరిట అవగాహన స దస్సు రవీంద్రభారతిలోని సమావేశ మందిరం లో నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన మామిడి హరికృష్ణ మాట్లాడు తూ ఔత్సాహిక రచయిత్రులకు తెలుగు భాషపై అవగాహన కల్పించడం కోసం చేస్తున్న ప్ర యత్నం అభినందనీయమని అన్నారు. ఈ సమావేశంలో లేఖిని అధ్యక్షురాలు పొత్తూరి విజయలక్ష్మి, ప్రధానకార్యదర్శి విజయలక్ష్మి, ప్రముఖ సాహితీవేత్త భా నుమతి, లేఖిని గౌరవాధ్యక్షురాలు నాగలక్ష్మి, భానుమతి, జీఎస్ లక్ష్మి, ప్రముఖ రచయిత్రి భారతి పాల్గొన్నారు.