చాదర్ఘాట్, జనవరి 6: షార్ట్ సర్క్యూట్, ఆపై గ్యాస్ లీక్ కావడంతో మలక్పేట్లోని ఓ హోటల్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ కార్మికుడు సజీవ దహనమయ్యాడు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మలక్పేట ప్రభుత్వ ఏరియా దవాఖాన సమీపంలోని సోహెల్ హోటల్లో ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి.
ఆ సమయంలో అక్కడ ఉన్న కస్టమర్లు, వంట గదిలో ఉన్న సిబ్బంది బయటికి పరుగులు తీశారు. షాబుద్దీన్ (34) అనే కార్మికుడు మాత్రం మంటల్లో చిక్కి సజీవ దహనమయ్యాడు. సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ప్రమాదానికి గల కారణాలను చాదర్ఘట్ పోలీసులు అన్వేషిస్తున్నారు.