బోడుప్పల్, పీర్జాదిగూడ, శామీర్పేట, డిసెంబర్ 22 : అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలకు సమప్రాధాన్యత కల్పిస్తున్నారని, అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నారని తెలిపారు. గురువారం బోడుప్పల్ కార్పొరేషన్ 16వ డివిజన్ పరిధిలోని పేద క్రిస్టియన్స్కు ప్రభుత్వం మంజూరు చేసి క్రిస్మస్ కానుకలను అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మేయర్ తెలిపారు.
పీర్జాదిగూడ కార్పొరేషన్లో..
ప్రభుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నదని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ తూంకుంట్ల ప్రసన్నలక్ష్మి శ్రీధర్రెడ్డి అన్నారు. గురువారం డివిజన్లో ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ కానుకలను క్రైస్తవులకు పంపిణీ చేశారు.కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మూడుచింతలపల్లిలో..
ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ కానుకలను మూడుచింతపల్లి మండలం కార్యాలయంలో గురువారం ఎంపీపీ హరిక, తాసీల్దార్ వాణిరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవి, సర్పంచ్ రవి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.