చర్లపల్లి, మే 19 : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని పుక్కట్నగర్లో రూ.35 లక్షల వ్యయంతో మంచినీటి పైప్లైన్ ఈసీనగర్లో రూ. 65లక్షలు, వీఎన్రెడ్డినగర్లోరూ. 33లక్షలు, భాగ్యనగర్లో రూ. 64లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ఆయన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, జలమండలి డీజీఎం సతీశ్, సర్కిల్ ఇంజినీరింగ్ ఈఈ హరిలాల్, జలమండలి మేనేజర్ రోహిత్తో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని కాలనీలలో అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ కాలనీలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ఉప్పల్ నియోజకవర్గాని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా కోట్లాది నిధులు కేటాయిం చి పూర్తి స్థాయిలో మంచినీటి పైప్లైన్, డ్రైనేజీ పనులు చేపట్టి పూర్తి చేస్తున్నామని తెలిపారు.
వచ్చే వర్షాకాలంనాటికి పూర్తి స్థాయిలో పైప్లైన్ నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా కాలనీలలో పారిశుధ్య పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, డివిజన్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం పలు కాలనీలకు చెందిన స్థానికులు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఈ స్వరూప, కుషాయిగూడ ఎస్సై ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వరరెడ్డి, నాగిళ్ల బాల్రెడ్డి, జాండ్ల ప్రభాకర్రెడ్డి, సారా అనిల్, బద్దం భాస్కర్రెడ్డి, సప్పడి శ్రీనివాస్రెడ్డి, జాండ్ల సత్తిరెడ్డి, కడియాల బాబు, ఎంకిరాల నర్సింహారెడ్డినాయక్, గంప కృష్ణ, నందకిశోర్, కనకరాజుగౌడ్, హరినాథ్, కొల నరేశ్గౌడ్,రాజేశ్వర్రెడ్డి, చెన్నయ్యగౌడ్, వర్మ, భూపతి వెంకటేశ్, చంద్రమౌళి, సత్యనారాయణ, ధనుంజయ్యగౌడ్, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి..
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్కు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు బాలకృష్ణారెడ్డి, ధాన్జినాయక్కు స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంలాంటిదని, అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వరరెడ్డి, నాగిళ్ల బాల్రెడ్డి, జాండ్ల ప్రభాకర్రెడ్డి, గిరిబాబు, సారా అనిల్, బద్దం భాస్కర్రెడ్డి, జాండ్ల సత్తిరెడ్డి, కడియాల బాబు, ఎంకిరాల నర్సింహ, రెడ్డినాయక్, నందకిశోర్, హరినాథ్, కోల నరేశ్గౌడ్, నారెడ్డి రాజేశ్వర్రెడ్డి, చెన్నయ్యగౌడ్, వర్మ, చంద్రమౌళి, సత్యనారాయణ, ధనుంజయ్యగౌడ్, పుష్పలత, భానుచందర్, ఎల్లయ్య, బొజ్జ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.