కాచిగూడ : నిషేధిత గంజాయిను అమ్ముతున్న నలుగురు మహిళలను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఇన్స్పెక్టర్ హాబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం పాడేరు ప్రాంతానికి చెందిన కృష్ణమూర్తి భార్య సరస్వతి (32), విశాఖపట్నం, పాడేరు, ఇస్తాగాద్ గ్రామానికి చెందిన చంటి భార్య లలిత (28), పాడేరు, కమ్మ కుర్తి గ్రామానికి చెందిన గణేశ్ భార్య లవాణ్య (20), పాడేరు ప్రాంతానికి చెందిన రామారావు భార్య అప్పలమ్మ (30) గత కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా విశాఖపట్నం నుంచి గంజాయిని తీసుకుని వచ్చి నగరంలోని పలు ప్రాంతాల్లో గంజాయి ప్యాకెట్లను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
విశాఖపట్నం నుంచి విశాఖ రైల్లో వచ్చిన వారు శనివారం రాత్రి కాచిగూడ రైల్వేస్టేషన్ ప్రాంతంలో విక్రయిస్తుండ గా విస్వనీయ సమాచారం మేరకు కాచిగూడ పోలీసులు సరస్వతి, లలిత, లవాణ్య, అప్పలమ్మను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 3 కిలోల 800 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.