ఉస్మానియా యూనివర్సిటీ : మహిళా దినోత్సవ వేడుకలను డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. కార్యాలయం ముందు కార్యకర్తలతో కలిసి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, రాఖీ కట్టి వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ఆయనకు రాష్ట్రంలోని మహిళలంతా రుణపడి ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, టీఆర్ఎస్ మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.