ముషీరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రెండవ రోజు ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలో ఆరు వార్డులలో టీఆర్ఎస్ శ్రేణులు మహిళా దినోత్సవ వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
నిత్యం ప్రజాహితం కోసం పని చేస్తున్న ఎఎన్ఎంలు, ఆశావర్కర్లు, పారిశుధ్య కార్మికులు, అంగన్వాడి టీచర్లను ఘనంగా సత్కరించి చీరెలు పంపిణీ చేశారు. ముషీరాబాద్ డివిజన్ రాంనగర్ రామాలయం వీధిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని పారిశుధ్య కార్మికులకు చీరెలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ముఠా జయసింహ, ముషీరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాడబోయిన నర్సింగ్ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్రెడ్డి, ఆకుల అరుణ్, టీ.సోమసుందర్, సాంబశివరావు, లక్ష్మీణ్ గౌడ్, రజినీ, గోవింద్, మాధవ్, శ్రీధర్చారి, శివముదిరాజ్లు పాల్గొన్నారు.
అదేవిధంగా అడిక్మెట్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ బి.హేమలతారెడ్డి, టీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహలు ఆశావర్కర్స్, ఎఎన్ఎంలను ఘనంగా సత్కరించి చీరెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిక్మెట్ డివిజన్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.సురేందర్, అనురాధ, ప్రసన్న, ఖదీర్లు పాల్గొన్నారు.
రాంనగర్ ఈ సేవా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నేత శ్రీనివాస్, సయ్యద్ అస్లాంలు మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరామిరెడ్డి, టక్కర్, శ్రీనివాస్, అహ్మద్, ప్రశాంత్, వెంకటేశ్వర్రావు, సుబ్బారావు, మున్నులు పాల్గొన్నారు.