కాప్రా, డిసెంబర్ 10 : మహిళలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శనివారం మల్లాపూర్ బాబూ జగ్జీవన్రామ్ కమ్యూనిటీహాల్లో టీఎస్ ఎస్సీసీడీసీ, ప్రొఫెషనల్ డిజైనింగ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో మూడునెలల పాటు ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న 35 మంది ఎస్సీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ముద్రలోన్స్, దళితబంధు వంటి పథకాలను సద్వినియోగం చేసుకొని వ్యాపారంలో రాణించాలని ఆకాంక్షించారు. మహిళల శిక్షణకు సహాయప డుతున్న సంస్థల సేవలను కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి కొనియాడారు. అభయ కౌన్సిలర్ , బీఆర్ఎస్ నేత అ నుముల నర్సింహారెడ్డి శిక్షణ పొందిన మహిళలను అభినందించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు మహిపాల్రెడ్డి, కిరణ్, మల్లేశ్, టీచర్లు షకీలా, పావని, లావణ్య పాల్గొన్నారు.