సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడానికి పలు విద్యాసంస్థల్లో, పలు వీధుల్లో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ ఆదేశాల మేరకు ర్యాలీలు, అవగాహన సమావేశాలు ముమ్మరంగా చేపడుతున్నారు. ముఖ్యంగా రెసిడెన్షియల్ అసోసియేషన్, స్వయం సహాయక సంఘాల మహిళలు స్లమ్, టౌన్ ఫెడరేషన్ సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ఓటు హక్కు వినియోగం,
ఓటు హక్కు ఓటర్ల బాధ్యతను తెలియజేయడం, ఓటు తప్పనిసరిగా వేయాలని… ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ అర్భన్ కమ్యూనిటీ విభాగం ద్వారా చిరు వ్యాపారులు, వివిధ కమ్యూనిటీ పెద్దలకు, యువతకు పూర్తి స్థాయిలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరుందో లేదో మరొకసారి, అలాగే మీ పోలింగ్ బూత్ను కూడా చెక్ చేసుకోవాలని ఈ ఓటరు చైతన్య కార్యక్రమంలో వివరిస్తున్నారు.