శంషాబాద్ రూరల్, మార్చి 17 : మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమని రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. గురువారం శంషాబాద్ జడ్పీటీసీ తన్వి ఆధ్వర్యంలో మండలంలోని పెద్దషాపూర్లోని ఎస్వీరెడ్డి గార్డెన్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ మహిళలు లేని సమాజాన్ని ఉహించలేమని తెలిపారు. సమాజంగా సగభాగమైన మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ మహిళలకు దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని వివరించారు. అంతకు ముందు వివిధ గ్రామాల నుంచి వచ్చిన చిన్నారులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, శంషాబాద్ ఎంపీపీ జయమ్మ, చైర్స్పర్సన్ సుష్మ, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.