హైదరాబాద్ : రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆస్పత్రిలోనే ఆత్మహత్యకు పాల్పడింది. నార్సింగి పరిధిలోని హైదర్ష్కోటేకు చెందిన సుదీప్తి(28) వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్. గత కొంతకాలం నుంచి ఆమెను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
ఈ క్రమంలో బండ్లగూడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. మంగళవారం రోజు తాను చికిత్స పొందుతున్న రూమ్ నం. 103లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుదీప్తి ఆత్మహత్య ఘటనను గమనించిన ఆస్పత్రి సిబ్బంది రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.