హైదరాబాద్: నగర శివార్లలోని మైలార్దేవ్పల్లిలో (Mailardevpally) విషాదం చోటుచేసుకున్నది. మైలార్దేవ్పల్లిలోని కింగ్స్ కాలనీలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఫాతిమా సుల్తానా అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నది. దీంతో పూర్తిగా కాలిపోయిన ఆమె అక్కడికక్కడే చనిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది.