అల్లాపూర్, మార్చి12 : అతివేగంగా దూసుకువచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది. కూకట్పల్లి పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ నర్సింగ్రావు తెలిపిన వివరాల ప్రకారం… జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో నివసిస్తున్న జెన్నీ ఒలిమా(45) ఆదివారం ఆమె తల్లిని చూడడానికి హాస్పిటల్ కు వెళ్లేందుకు బైక్ బుక్ చేసుకుని వెళ్లింది.
మూసాపేట మెట్రోపిల్లర్ నం 878 వద్దకు రాగానే పక్క నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జెన్నీ అక్కడికక్కడే మృతి చెందింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.