వెంగళరావునగర్, ఆగస్టు 18 : షాపింగ్కు వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై కృష్ణయ్య కథనం మేరకు..ఎర్రగడ్డ లోని గోకుల్ థియేటర్ సమీపంలో నివాసం ఉండే సురేష్ శర్మ , సరిత(37) దంపతులు. ఈ నెల 16వ తేదీ సోమవారం షాపింగ్కు వెళ్లిన భార్య సరిత ఇంటికి తిరిగి రాలేదు. కూతురు కోమల్ శర్మ తల్లికి ఫోన్ చేస్తే అమీర్పేటలో షాపింగ్ చేస్తున్నాను అరగంటలో ఇంటికి వస్తానని తల్లి చెప్పడంతో ఆమె కోసం వేచి చూశారు.
సాయంత్రమైన సరిత ఇంటికి తిరిగి రాలేది. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో ఆమె కోసం పరిసర ప్రాంతాల్లో, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త సురేష్ ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.