Hyderabad | హైదరాబాద్ : ఓ మహిళా డాక్టర్ తన తల్లిదండ్రులతో గొడవపడి అదృశ్యమైంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. దమ్మాయిగూడకు చెందిన డాక్టర్ శీరిష అమీర్పేటలోని వెల్నెస్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తుంది. అయితే తన ఫ్రెండ్ ఆంథోనీకి బ్యాంకు లోన్ విషయంలో సహాయం చేసింది. అప్పట్నుంచి శీరిషతో ఆమె తల్లిదండ్రులు గొడవ పడుతున్నారు.
ఈ క్రమంలో జులై 29న విధులకు వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిపోయిన శీరిష ఇప్పటి వరకు తిరిగి రాలేదు. దీంతో అమీర్పేటలో నివాసం ఉంటున్న ఆమె పేరెంట్స్ ఎస్సార్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మీరు ఎప్పుడైతే తనతో గొడవ పడకుండా ఉంటారో అప్పుడే తాను ఇంటికి వస్తానని తల్లిదండ్రులకు శీరిష మేసేజ్ చేసినట్లు పేర్కొన్నారు.