పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
ఖైరతాబాద్, మే 31 : అసభ్య వీడియోలు తీసి.. తాను తీయలేదంటూ బుకాయిస్తున్న ఓ వ్యక్తిపై బాధిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. పంజాగుట్టలో నివాసముంటున్న యువతికి 2014 నుంచి బంజారాహిల్స్కు చెందిన సచిన్ వి ఆవతేతో పరిచయం ఉంది. సచిన్ తరచూ ఆ యువతిని అనుమానంతో కొడుతూ, తనతో గడపాలని వేధించడంతో అతడి నుంచి తెగతెంపులు చేసుకున్నది.
గత పది రోజులుగా ఆమెకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు సర్క్యూలేట్ అవుతున్నాయంటూ స్నేహితురాళ్లు చెప్పారు. ఆ వీడియోలు చూసిన వెంటనే ఆమె సచిన్కు ఫోన్ చేసింది. ఆ వీడియోను తన సెల్ఫోన్ నుంచి ఎవరో హ్యాక్ చేసి సర్క్యూలేట్ చేస్తున్నారంటూ బుకాయించాడు. దీంతో ఆమెతో ఉన్న సమయంలో తెలియకుండా ఈ వీడియో తీసినట్లు గ్రహించిన బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.