హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్లో దూకి మహిళ బలవన్మరణానికి పాల్పడింది. బుధవారం ఉదయం శైలజ (38) అనే మహిళ చున్నీతో మెడకు బిగించుకుని హుస్సేన్ సాగర్లోకి దూకింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శైలజ గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది.