బంజారాహిల్స్ : భర్తతో విడిపోయి పిల్లలతో ఉంటున్న మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్కు చెందిన బి.సరిత (42)కు 2001లో జగన్ అనే వ్యక్తితో పెళ్లయింది. వీరికి ఇద్దరు కొడుకులున్నారు.
కాగా భర్తతో విభేదాలు రావడంతో 2015నుంచి ఇద్దరు కొడుకులతో కలిసి తండ్రి ఇంట్లోనే ఉంటున్న సరిత కొండాపూర్లోని ఫెమ్ ఆస్పత్రిలో సూపర్వైజర్గా పనిచేస్తోంది. కాగా భర్తతో దూరంగా ఉన్నాననే బెంగతో పాటు జీవితంపై విరక్తితో ఈనెల 19న అర్థరాత్రి సమయంలో రూమ్ క్లీనింగ్ యాసిడ్ సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది.
దీంతో తీవ్ర ఆస్వస్థకు గురయిన సరితను బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 20న తన కుమార్తె మృతి చెందినట్లు మంగళవారం మృతురాలి తండ్రి యాదయ్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.