మన్సూరాబాద్, మార్చి 28: హయత్నగర్ చౌరస్తా నుంచి కుంట్లూరు మార్గంలో మదర్డైరీ వరకు ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న వ్యాపార నిర్మాణాలను ఈనెల 22న జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. దీంతో వీధి వ్యాపారులు జీవనోపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని టీఆర్ఎస్ నాయకుడు చెన్నగోని శ్రీధర్గౌడ్ సోమవారం ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కుంట్లూరు మార్గంలో పర్యటించి వీధి వ్యాపారులతో మాట్లాడారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా వీధి వ్యాపారులు డబ్బాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేసుకునేలా సంబంధిత అధికారులతో మాట్లాడుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, హయత్నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీధర్గౌడ్, నాయకులు పోచబోయిన జగదీశ్యాదవ్, జక్కిడి రఘువీర్రెడ్డి, కొసనం వెంకట్రెడ్డి, అత్తాపురం రాంచంద్రారెడ్డి, సిద్దగౌని జగదీశ్గౌడ్, కేకేఎల్ గౌడ్, ఆనంద్యాదవ్, నెమలి సురేశ్, పారంద నర్సింగ్రావు, తదితరులు పాల్గొన్నారు.
కాలనీ ముఖద్వారం పనులు ప్రారంభం
మన్సూరాబాద్ డివిజన్ హయత్నగర్ పరిధి ప్రగతినగర్ కాలనీ ముఖ ద్వారం ఏర్పాటు పనులను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఆలయ అభివృద్ధికి కృషి
మన్సూరాబాద్ డివిజన్ పరిధి విజయశ్రీకాలనీలోని పద్మావతి గోదా సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయం షష్టమ వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీర్క నర్సిరెడ్డి, కో-చైర్మన్ ఏనుగు చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి, కార్యదర్శి పి.నర్సింహాచారి, కోశాధికారి బి.లోకేశ్గౌడ్, సలహాదారుడు బి.నర్సింహారెడ్డి, సంయుక్త కార్యదర్శి డి.సత్యనారాయణ, కాలనీ అధ్యక్షుడు మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మార్గం రాజేశ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఇష్టపడి చదవాలి..
చంపాపేట, మార్చి28: విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఇష్టపడి చదవాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం కర్మన్ఘాట్లోని శ్రీ లక్ష్మి కన్వెన్షన్ హాల్లో దీక్ష జూనియర్ కాలేజీ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ముఖ్య అతిథిగాహాజరై, కళాశాల యాజమాన్యం క్రాంతికుమార్తో కలిసి జ్వోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్రెడ్డి, హయత్నగర్ కార్పొరేటర్ నవజీవన్రెడ్డి, మన్సురాబాద్ కార్పొరేటర్ కొప్ఫుల నర్సింహారెడ్డి కాలేజీ ఎల్బీనగర్ బ్రాంచీ ప్రిన్సిపాల్ కరుణాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.