– ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి
చర్లపల్లి, మార్చి 17 : వేసవి కాలంలో నియోజకవర్గ పరిధిలో మంచినీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లి డివిజన్, నాగార్జుననగర్ కాలనీలో రూ.41లక్షలు, చక్రీపురం కాలనీలో రూ.32 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులను డిప్యూటీ కమిషనర్ శంకర్తో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో నెలకొన్న మంచినీటి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, స్థానిక కార్పొరేటర్లు, జలమండలి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసు కుంటున్నామన్నారు. అదేవిధంగా డివిజన్లలో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా శిథిలావస్థకు చేరుకున్న డ్రైనేజీలను గుర్తించి.. నూతన డ్రైనేజీ వ్వవస్థను ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించి.. పనులు చేపడుతున్నామన్నారు.
అదేవిధంగా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. డివిజన్లలో వీధిదీపాల నిర్వహణను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, డివిజన్లలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురా వాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సర్కిల్ డీఈ శ్రీరాములు, ఏఈ సంతోశ్రెడ్డి, సీసీఎస్ ప్రతినిధి ఎంపెల్లి పద్మారెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు డప్పు గిరిబాబు, అనిల్, సంక్షేమ సంఘాల నాయకులు మొగిలి రాఘవరెడ్డి, ఆంజనేయులు, కొండారెడ్డి, తిరుమలేశ్, అప్పారావు, జగన్మోహ న్రెడ్డి, నాయకులు ముత్యంరెడ్డి, రఘుపతిరెడ్డి, గడ్డం రవికుమార్, వంశీరాజు, చల్లా వెంకటేశ్, నర్సింహాగౌడ్, గంప కృష్ణ, సర్ఫ్రాజు, వెంకటేశ్, మంద చం ద్రమౌళి, రాధాకృష్ణ, లక్ష్మి, మనోహర్, రాకేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.