వనస్థలిపురం, ఏప్రిల్ 9: మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి పేర్కొన్నారు. బీఎన్రెడ్డినగర్ డివిజన్ స్నేహమయినగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికయ్యింది. టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యేను కలిశారు. కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాప్రాయి చెరువు కింది కాలనీల వరదన నివారణకు కృషి చేస్తున్నామన్నారు. తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రామాంజనేయులు, శీనయ్య, మహేందర్, సుబ్బారావు, సుదర్శన్రెడ్డి, ఉమాకాంత్ తివారి తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత..
ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శనివారం హస్తినాపురం డివిజన్ భూపేష్గుప్త నగర్లో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలకు హాజరయ్యారు. నూతనంగా నిర్మించిన కంఠ మహేశ్వరస్వామి, దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సత్యం చారి, రాములుగౌడ్, నారాయణగౌడ్, మల్లేశ్గౌడ్, నారగోని శ్రీనివాస్యాదవ్, తదితరులు పాల్గొన్నారు.