పీర్జాదిగూడ మేయర్ వెంకట్రెడ్డి
పీర్జాదిగూడ, ఏప్రిల్ 7: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. గురువారం నగరపాలక పరిధి… 24వ డివిజన్లో రూ.19 లక్షల కార్పొరేషన్ సాధారణ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్, స్థానిక కార్పొరేటర్ అనంతరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పాలకసంస్థ అభివృద్ధే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు.
డివిజన్లోని సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. 20వ డివిజన్లోని ఇంద్రానగర్లో సన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని మేయర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ భీమ్రెడ్డి నవీన్రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, మహేశ్, కాలనీవాసులు పాల్గొన్నారు.