నెహ్రూ జువలాజికల్ పార్క్కు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. మరో వైపు ఎండ వేడిమి అధికంగా ఉండడంతో ఎన్క్లోజర్లో జంతువులు వేసవి తాపాన్ని తట్టుకోలేక నీటి మడుగులో జలకాలాటలు ఆడుతూ కనిపించాయి.
హాయ్ రే హాయ్..
వేసవి తాపానికి మనుషులే కాదు.. మూగజీవాలూ అల్లాడిపోతున్నాయి. అందుకే జూలో ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు నీటి వసతులు కల్పిస్తున్నారు. ఎంత హాయిగా ఉందో అన్నట్టు.. ఆదివారం ఓ గజరాజు ఇలా చల్లని జల్లుల్లో తడిసిముద్దయింది. భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందింది.