సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 14.63 కోట్ల నగదును ఎన్ఫోర్స్మెంట్ వింగ్ సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు. రూ.6,90,90,818 విలువజేసే ఇతర వస్తువులు, 20,920.91 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు చెప్పారు. 208 మందిపై కేసులు నమోదు చేసి, 206 మందిని అరెస్టు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువులపై 429 ఫిర్యాదులు రాగా, వాటిని పరిష్కరించారని, 284 మందిపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 2,920 లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు రోనాల్డ్రాస్ తెలిపారు. తాజాగా.. గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.5.88 లక్షల నగదు, రూ .కోటి 62 లక్షల విలువైన వస్తువులను పట్టుకొని, సీజ్ చేసినట్లు వివరించారు.