మియాపూర్, మే 30 : పేదల కష్టనష్టాలలో సీఎం కేసీఆర్ అండగా నిలుస్తూ వారికి పూర్తి భరోసాను కల్పిస్తున్నారని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. సీఎం సహాయనిధి పథకంతో కార్పొరేట్ వైద్యాన్ని పేదలు పొందేలా ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నామన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 39 మందికి సీఎం సహాయనిధి పథకం ద్వారా మంజూరైన రూ.13,04,800 ఆర్థిక సాయం నిధులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి విప్ గాంధీ మంగళవారం తన నివాసంలో లబ్ధిదారులకు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, వారి అవసరాలకు తగ్గట్టుగా పథకాల ద్వారా అండగా నిలుస్తున్నారని విప్ గాంధీ అన్నారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి ఆపన్న హస్తంలా ఉపయోగపడుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఊట్ల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.