మియాపూర్, నవంబర్ 8 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, నియోజకవర్గంలో రూ.9వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, ప్రజల ఆశీస్సులతో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, విప్ అరెకపూడి గాంధీ వివేకానందనగర్లోని తన నివాసం వద్ద కుటుంబసభ్యులు, వందలాదీ పార్టీ శ్రేణులు వాహనాల ర్యాలీతో నామినేషన్కు వెళ్లారు.
ఈ సందర్భంగా మార్గమధ్యలో ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి విప్ గాంధీతో కలిసి ప్రచారరథంపై ర్యాలీలో పాల్గొన్నారు. కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మాధవరం రోజాదేవి, నార్నె శ్రీనివాస్రావు, దొడ్ల వెంకటేశ్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, హమీద్ పటేల్, మంజులరెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, సింధు ఆదర్శ్రెడ్డి సహా పార్టీ కార్యకర్తలు, డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు దేవాలయాల్లో విప్ గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి శేరిలింగంపల్లిలోని ఆర్వో కార్యాలయానికి చేరుకున్న విప్ గాంధీ, కార్పొరేటర్లతో కలిసి ఆర్వోకు నామినేషన్ను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, మహిళా నేతలు, మాజీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మియాపూర్, నవంబర్ 8 : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా విప్ అరెకపూడి గాంధీ బుధవారం నామినేషన్ను దాఖలు చేశారు. శేరిలింగంపల్లిలోని ఆర్వో కార్యాలయంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, మాధవరం రోజాదేవి, మంజులరెడ్డిలతో కలిసి విప్ గాంధీ ఆర్వో శ్రీనివాసరెడ్డికి మధ్యాహ్నం నామినేషన్ పత్రాలు అందించారు. కాగా, బీఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీ సతీమణి అరెకపూడి శ్యామల స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ను దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరెకపూడి గాంధీ సతీమణి అరెకపూడి శ్యామల భర్తతోపాటే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే సంప్రదాయాన్ని కొనసాగించారు. అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని, ప్రజలందరి సంపూర్ణ మద్దతుతో హ్యాట్రిక్ సాధిస్తామన్నారు.