శంషాబాద్ రూరల్ : మండలంలోని చిన్నగోల్కొండ గ్రామంలో సర్పంచ్ గుర్రం పద్మావతిరెడ్డి, డైరక్టర్ ఆనంతరెడ్డిల ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణమహోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. కల్యాణమహోత్సవానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్, జడ్పీటీసీ నీరటి తన్విరాజులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నగోల్కొండ గ్రామంలో శివపార్వతుల కల్యాణం నిర్వహించడంతో పాటు నూతనంగా శివాలయం పరిధిలో కోనేరు నిర్మాణం చేయడం అద్బుతంగా ఉందన్నారు. గ్రామాలలోని ప్రజలు భక్తిభావాన్ని పెంచుకొని ఆలయాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నీలంమోహన్, మార్కెట్ కమిటి చైర్మన్ వెంకటేశ్గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు కే చంద్రారెడ్డి,ఉప సర్పంచ్ భిక్షపతి, వార్డు సభ్యులు గౌతమ్బాబు,సారలక్ష్మీ, పలువురు పార్టీనాయకులు, కార్యకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.