మల్కాజిగిరి : నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (MLA Marri Rajashekar Reddy) అన్నారు. మంగళవారం మౌలాలి డివిజన్ హనుమాన్నగర్, తిరుమల నగర్ కాలనీలలో ఎమ్మెల్యే పాదయాత్ర(Padayatra) చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్నగర్ కాలనీలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ, మురుగు నీటి పారుదల సౌకర్యంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామని అన్నారు.
డ్రైనేజీ సమస్య (Drainage problem) పై రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్తో సమస్య శాశ్వతంగా పరిష్కరించడానికి సహకరించాలని కోరానని అన్నారు. ఇప్పటికే రైల్వేకు రూ.34లక్షలు చెల్లించామని గుర్తు చేశారు. అధికారులతో సర్వే చేయించి నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తామని, నిధులు మంజూరైన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తిరుమల నగర్ రిజర్వాయర్ నుంచి నీటి సరఫరాను మెరుగు పరచాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. రోడ్లు గుంతలు పడడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సీసీ రోడ్ల నిర్మాణపను చేపడతామని అన్నారు.