చిక్కడపల్లి : సుందరయ్య పార్కు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కులో ఆదివారం వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ సుందరయ్య పార్కు నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.
నూతన అధ్యక్షుడిగా పాండయ్య, కార్యదర్శిగా సంతోష్ గౌడ్, కోశాధికారిగా రమేశ్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎం.ఎన్రావు తదితరులను క్లబ్ డిస్ట్రిక్ గవర్నర్ ఎస్హెచ్ కే ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ రవి చారి, హౌజ్స్ఫెడ్ డైరెక్టర్ కిషన్ రావు, టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, వెంకట కృష్ణ, దామోదర్రెడ్డి, పూర్వ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గౌడ్, నాగభూషణం, రాజేశ్వరరావు, రామానందం, విజయ్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోజస్, దామోదర్ రెడ్డి, ఆర్.వివేక్ తదితరులు పాల్గొన్నారు.