జూబ్లీహిల్స్,సెప్టెంబర్29: అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని.. ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చే ఇళ్ల విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎ మ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 1743 మంది లబ్ధిదారులను డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎంపిక చేశామని.. దశల వారీగా మిగతా వారిని ఎంపిక చేస్తామని అన్నారు. శుక్రవారం యూసుఫ్గూడ డివిజన్ మహమూద్ ఫంక్షన్హాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం డబుల్ బెడ్రూం మూడో విడుత లబ్ధిదారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని.. రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన రీతిలో సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారన్నారు. ప్రతి పేద వాడికి ఉండడానికి సొంత ఇళ్లు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని.. గతంలో ఏ పాలకులకు ఈ ఆలోచన రాలేదన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు డబుల్ బెడ్రూంలు ఎక్కడ కట్టలేదని దుష్ప్రచారం చేస్తున్నారని.. అక్టోబర్ 2 న వస్తే ప్రజలే ఇండ్లు ఎక్కడ ఉన్నాయో చూపిస్తారని అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు కనబడటంలేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయా పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలలో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ఆయా పార్టీలు చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని.. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న పార్టీలకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు సంజీవ, ప్రదీప్, కృష్ణమోహన్, సంతోష్, బీఆర్ఎస్ నాయకులు అంబటి రామకృష్ణ, విజయ్కుమార్, నజీర్, విజయ్ సింహ, సిరాజ్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ: మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సీఎం కేసీఆర్కు మైనార్టీ వర్గాల్లో ఎంతో ఆదరణ ఉన్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మైనార్టీ సంక్షేమంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్కు చెందిన మైనార్టీ మహిళలకు శుక్రవారం కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉంటున్న మైనార్టీల్లో అత్యధిక శాతం పేద కుటుంబాలే ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా కుటుంబాలకు షాదీ ముబారక్తో పాటు ఇతర పథకాలు అందే విధంగా పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. ఇప్పటికే వేలాది మందికి షాదీ ముబారక్ పథకం అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికలతో సంబంధం లేకుండా అభివృద్ధి, సంక్షేమం విషయంలో నిర్విరామంగా కృషి చేస్తున్న కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కావటం తథ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ ఖురేషీ, సయ్యద్స్రూల్, మహ్మద్అహ్మద్, మహ్మద్ముస్తాక్, సయ్యద్స్రూల్, జహంగీర్, బాబుజానీ, అఫ్సర్, సర్దార్, రహీం, కల్యాణి, రాజమణి, పద్మ పాల్గొన్నారు.