శంషాబాద్ రూరల్ : కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం మండలంలోని పాలమాకుల, ముచ్చింతల్కు చెందిన క్రియాశీలక సభ్యత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు ఒక్కరికీ రెండు లక్షల చొప్పున రూ. 4 లక్షల చెక్కులను క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు రక్షణ కల్పించడంతో పాటు క్రియాశీలక సభ్యత్వం ఉన్న వారికి రెండు లక్షల బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ముచ్చింతల్కు చెందిన వెంకటేశ్, పాలమాకులకు చెందిన కృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు బీమా డబ్బులు అందజేశామని వెల్లడించారు.
మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావు, నాయకులు కృష్ణాగౌడ్, రమేశ్, శ్రీధర్గౌడ్, గిరిగౌడ్, కత్తుల జనార్దన్, రాజు, ఆంజనేయులు,రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.